పౌర్ణమి వేళ-పల్లకీ లో దుర్గమ్మ.

పాపన్నపేట,మే,30,మెదక్ టుడే న్యూస్: భక్తుల జయ జయ ద్వానాలతో అరణ్యంలో ఆధ్యాత్మికత సంతరించుకుంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మెదక్ జిల్లా ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం. శనివారం పౌర్ణమి ని పురస్కరించుకొని వనదుర్గా క్షేత్రంలో వైభవంగా పల్లకీ సేవా నిర్వహించారు. అర్చకులు శంకర్ శర్మ మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజగోపురం,శివాలయం ముందుగా ఈ ఊరేగింపు కనుల పండువగా సాగింది.