పాపన్నపేట,మార్చి,20,మెదక్ టుడే న్యూస్: పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకుని మెదక్ జిల్లాలోని ముస్లిం సోదర సోదరీమణులందరికీ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ మాసం క్రమశిక్షణ, దాతృత్వం, మత సామరస్యానికి ప్రతీక అని పేర్కొన్నారు. నెల రోజుల పాటు అత్యంత భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్షలు ఆచరించి, ప్రార్థనలు నిర్వహించిన ముస్లిం సోదరులకు ఈ పండుగ ఆనందాన్ని, ఆరోగ్యాన్ని చేకూర్చాలని శుక్రవారం ఒక ప్రకటనలో ఆకాంక్షించారు.