MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 20 May 2026, 4:00 am Digital Edition : Shiva Kumar

పాపన్న పేట మండల అధ్యక్షులుగా లింగంపేట నరేందర్ గౌడ్ నియామకం.

మెదక్ :పాపన్నపేట,20,మెదక్ టుడే న్యూస్:మెదక్ జిల్లా పాపన్న పేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా పాపన్నపేట గ్రామానికి చెందిన పార్టీ సీనియర్ నాయకులు, నరేందర్ గౌడ్
నియామకం అయ్యారు.మంగళవారం టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ లు మెదక్ జిల్లాలోని మండలాల అధ్యక్షులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.అందులో భాగంగానే పాపన్నపేట మండలానికి లింగంపేట నరేందర్ గౌడ్ ను నియమిస్తూ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా నరేందర్ గౌడ్ మాట్లాడుతూ నా మీద నమ్మకంతో పాపన్నపేటకాంగ్రెస్ పార్టీ మండల్ అధ్యక్షులుగా అవకాశం కల్పించిన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు,కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు,పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కు,కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులకు కార్యకర్తలకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. మండలం లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని చెప్పారు.