MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 25 April 2026, 1:53 am Digital Edition : Medak Today

పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా,

చేగుంట,ఏప్రిల్,24,మెదక్ న్యూస్:చేగుంట మండలం వడియారం గ్రామంలో పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ జిల్లా పంచాయతీరాజ్ అధికారి యాదయ్య హాజరైనారు. వారిని గ్రామ సర్పంచ్ పాలకవర్గ సభ్యు లు శాలువాతో సన్మానం చేసినారు అనంతరం వారు మాట్లాడుతూ అందరూ కలిసికట్టుగా ఉండి గ్రామ అభివృద్ధిని చేసుకోవాలని అని అన్నారు తను కూడా వడియారం గ్రామపంచాయతీ అభివృద్ధికి సహకరిస్తాన ని హామీ ఇచ్చారు ఒకేసారి అన్ని పనులు కాకుండా ఒకటి ఒకటి చేసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సాయికుమార్ గౌడ్, ఉప సర్పంచ్ నాగరాజు, పంచాయతీ కార్యదర్శి విజయపాల్ రెడ్డి,గ్రామపంచాయతీ పలకవర్గం పాల్గొనడం జరిగినది.