MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 24 November 2025, 4:58 pm Digital Edition : Medak Today

పంచాయతీ సెక్రెటరీ వేధింపులకు ఆత్మహత్య చేసుకున్న కుటుంబాన్ని ఆదుకోండి..

•పంచాయతీ సెక్రెటరీ వేధింపులకు ఆత్మహత్య చేసుకున్న కుటుంబాన్ని ఆదుకోండి..

చేగుంట,నవంబర్,24,మెదక్ టుడే న్యూస్:

మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో చేగుంట మండలం పోలంపల్లి గ్రామపంచాయతీ సెక్రటరీ వేధింపులకు ఆత్మహత్య చేసుకున్న కొండి లక్ష్మి వైఫ్ ఆఫ్ ఆంజనేయులు కుటుంబానికి హామీ ఇచ్చిన ఆర్డీవో,తహసిల్దార్,ఎంపీడీవో, డి ఎల్ పి ఓ,ఒక ఎకరా ప్రభుత్వ భూమి ఇవ్వాలని కలెక్టర్ ను కలవడం జరిగినది. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొండి స్వామి, మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి శ్యామల అశోక్,డిపిఎఫ్ నాయకులు సంజు, మాల మహానాడు శంకరంపేట్ మండల అధ్యక్షుడు సంజు,దళిత నాయకులు పాల్గొనడం జరిగింది.