పదో తరగతి ఫలితాల్లో ‘వ్రిహా’ స్కూల్ ప్రభంజనం.. 100 శాతం ఉత్తీర్ణతతో రికార్డు!

టాపర్లకు నగదు పురస్కారాలు అందజేసిన ఛైర్మన్ జి.టి. విజయ కృష్ణ అమీన్‌పూర్,ఏప్రిల్,30,(మెదక్ టుడే) న్యూస్:ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లోని వ్రిహా స్కూల్ పదవ తరగతి ఫలితాల్లో అద్భుత విజయాలను నమోదు చేసి తన ప్రత్యేకతను చాటుకుంది. గురువారం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాఠశాల ఛైర్మన్ జి.టి. విజయ కృష్ణ ఫలితాల వివరాలను వెల్లడించారు.వంద శాతం విజయం:ఈ ఏడాది వ్రిహా స్కూల్ నుండి 32 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరుకాగా, అందరూ ఉత్తీర్ణత సాధించి 100 శాతం ఫలితాలను సాధించడం...