MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 01 May 2026, 2:20 am Digital Edition : Medak Today

పదో తరగతి ఫలితాల్లో ‘వ్రిహా’ స్కూల్ ప్రభంజనం.. 100 శాతం ఉత్తీర్ణతతో రికార్డు!

టాపర్లకు నగదు పురస్కారాలు అందజేసిన ఛైర్మన్ జి.టి. విజయ కృష్ణ

అమీన్‌పూర్,ఏప్రిల్,30,(మెదక్ టుడే) న్యూస్:ప్రతినిధి.సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లోని వ్రిహా స్కూల్ పదవ తరగతి ఫలితాల్లో అద్భుత విజయాలను నమోదు చేసి తన ప్రత్యేకతను చాటుకుంది. గురువారం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాఠశాల ఛైర్మన్ జి.టి. విజయ కృష్ణ ఫలితాల వివరాలను వెల్లడించారు.వంద శాతం విజయం:
ఈ ఏడాది వ్రిహా స్కూల్ నుండి 32 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరుకాగా, అందరూ ఉత్తీర్ణత సాధించి 100 శాతం ఫలితాలను సాధించడం విశేషం. విద్యార్థుల అంకితభావం, ఉపాధ్యాయుల నిరంతర కృషి వల్లే ఈ అద్భుత ఫలితాలు సాధ్యమయ్యాయని ఈ సందర్భంగా ఛైర్మన్ పేర్కొన్నారు.ప్రతిభావంతులకు నగదు పురస్కారాలు,పాఠశాల స్థాయిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు యాజమాన్యం నగదు పురస్కారాలను అందజేసింది. వివరాలు ఇలా ఉన్నాయి:ప్రథమ స్థానం: అక్షిత (588/600) – రూ. 25,000 నగదు బహుమతి
ద్వితీయ స్థానం: హాసిని (586 మార్కులు) – రూ. 15,000 నగదు బహుమతి
తృతీయ స్థానం: శ్రేయ (580 మార్కులు) – రూ. 10,000 నగదు బహుమతి.ఘనంగా సన్మానం:
ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం శాలువాలతో ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ డాక్టర్ ఎన్. ప్రియబాంధవి, ప్రిన్సిపల్ జి. రాధిక, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొని హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కూడా ఇదే విధమైన నాణ్యమైన విద్యను అందిస్తూ మరిన్ని విజయాలు సాధిస్తామని పాఠశాల బృందం ధీమా వ్యక్తం చేసింది.