రామచంద్రాపురం,ఏప్రిల్,29,(మెదక్ టుడే)న్యూస్ ప్రతినిధి,ఇటీవల విడుదలైన పదవ తరగతి ఫలితాల్లో రామచంద్రాపురం నివాసి సుంకు పావకి విశిష్ట ప్రతిభ కనబరిచింది. రామచంద్రాపురంలోని పాత ఎం.ఐ.జి లో గల శ్రీ వాణి విద్యా నికేతన్ పాఠశాలలో చదువుతున్న ఈమె, 94.6 శాతం మార్కులతో ‘ఏ-1’ గ్రేడ్ సాధించి పాఠశాల స్థాయిలోనే ప్రథమ స్థానంలో నిలిచింది.రామచంద్రాపురం వాసులైన శ్రీ సుంకు హరిబాబు, శ్రీమతి సుంకు లావణ్య దంపతుల కుమార్తె అయిన పావకి, తన క్రమశిక్షణ మరియు పట్టుదలతో ఈ ఘనత సాధించి తల్లిదండ్రులకు,పాఠశాలకు మరియు ఈ ప్రాంతానికి ఎనలేని కీర్తినితీసుకువచ్చింది.ఈసందర్భంగా పాఠశాల యాజమాన్యం మరియు తల్లిదండ్రులు మాట్లాడుతూ,పావకి మొదటి నుండి చదువులో ఎంతో చురుకుగా ఉండేదని, ఆమె కష్టానికి తగిన ఫలితం దక్కిందని హర్షం వ్యక్తం చేశారు.తోటి విద్యార్థులకు పావకి విజయం ఒక గొప్ప స్ఫూర్తి అని, యువత ఇలాంటి ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగాలని ఆకాంక్షించారు.ఈవిజయంలో కీలక పాత్ర పోషించిన ఉపాధ్యాయ బృందానికి మరియు తోడ్పాటు అందించిన తల్లిదండ్రులకుప్రత్యేకకృతజ్ఞతలుతెలియజేశారు.కుమారి సుంకు పావకి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, ఆమె ఉన్నత చదువుల్లో కూడా ఇలాగే రాణించాలని స్థానికులు మరియు పాఠశాల సిబ్బంది మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.
