చేగుంట,మార్చి,13,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలంలోని చేగుంట, వడియరం, రెడ్డి పల్లి, చందాయి పేట్, మక్కరాజ్ పేట్, గీతా ఆరు పరీక్షా కేంద్రాలలో బాలురు 334, బాలికలు 335 మొత్తం 669 విద్యార్థులు పరీక్ష వ్రాస్తున్నారు. ఈ సందర్భంగా మక్కరాజ్ పేట్ పరీక్ష కేంద్రం చీఫ్ సూపర్డెంట్ శీలం మల్లారెడ్డి, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ చల్లా లక్ష్మణ్ మాట్లాడుతూ విద్యార్థులందరూ సమయానికి పరీక్షా కేంద్రాన్ని చేరుకోవాలని, పరీక్ష రాయడానికి కావలసినటువంటి వస్తువులు తెచ్చుకోవాలని, ఎటువంటి ఆందోళన చెందకుండా ప్రశాంతంగా పరీక్షలు వ్రాయాలని వారన్నారు