MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 02 February 2026, 6:39 am Digital Edition : SHIVA KUMAR

ఒక్క అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా మెదక్ మున్సిపాలిటీ 8 వ వార్డు బిజెపి అభ్యర్థి లావణ్య నర్సింగరావు.

మెదక్,ఫిబ్రవరి,1,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి.మెదక్ పట్టణంలోని రామ్ నగర్ కాలనీ వాసవి నగర్ కాలని 8వ వార్డు ఓటర్ మహాశయులందరికి నమస్కారములతో భారతీయ జనతా పార్టీ సహకారంతో కౌన్సిలర్ గా పోటీ చేస్తూ మీ ముందుకి వస్తున్నాను. మెదక్ పట్టణంలో రాంనగర్ మరియు వాసవి నగర్ ఎనిమిదో వార్డులో గతంలో కౌన్సిలర్ గా పని చేసిన వారు అభివృద్ధిలో వెనుకబడ్డారు కాంగ్రెస్ టిఆర్ఎస్లకు అవకాశం ఇచ్చారు ఒకసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు రాంనగర్ మన వార్డులో ప్రతి పైసా జవాబుదారితనముగా ఉపయోగిస్తాము. రామ్ నగర్ వాసవినగర్ లో ఉన్న ప్రతి సమస్యను తీర్చడంలో ముందుంటాము. రామ్ నగర్ లో ఉన్న ఓటరు మహాశయులకు విన్నవించేది ఒక్కసారి ఆలోచించండి, మీరు వేసే ఓటు ప్రగతికి బాటగా నిలుస్తుంది .దేశంలో మోడీ నాయకత్వంలో పట్టణాలు పల్లెలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయి. వికసితభారత్ దిశగా అడుగులు వేస్తున్నాయి మన పట్టణాన్ని కూడా అభివృద్ధి దిశగా అడుగులు వేద్దాం. భారతీయ జనతా పార్టీ పట్టణాలను వేగంగా అభివృద్ధి చేస్తుంది మన మెదక్ పట్టణం కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే బిజెపికి మీ ఓటు వేయండి అభివృద్ధిలో భాగస్వాములు కండి రామ్ నగర్ లో వాసవి నగర్ లో ఉన్న ప్రతి సమస్యను తీర్చడంలో మీ ముందుంటాము. పారిశుద్ధ సమస్య, నీటి సమస్య సమస్య మౌలిక వసతులు కరెంటు సమస్య గృహము లేని వారికి గృహాలు అందివ్వడం, నిస్వార్ధంగా పనిచేసే వారికి పట్టం కట్టండి ప్రజాసేవకి అంకితం అవుతామని ఒకసారి అవకాశం ఇవ్వండి అభివృద్ధిని చేసి చూపిస్తాముఅని
లావణ్య నర్సింగ్ రావు తెలిపారు.8వ వార్డ్ కౌన్సిలర్ బీజేపీ అభ్యర్థిరాంనగర్ కాలని,మరియు వాసవి నగర్ కాలని,