MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 11 November 2025, 11:06 am Digital Edition : Medak Today

నాగర్‌కర్నూల్ జిల్లాలో దారుణం,పుస్తకాలు తరలించేందుకు విద్యార్ధులను కూలీలుగా వాడుకున్న ప్రభుత్వ పాఠశాల సిబ్బంది

(స్టేట్ బ్యూరో)నగర కర్నూల్ జిల్లా, నవంబర్ 11 మెదక్ టుడే న్యూస్:

•నాగర్‌కర్నూల్ జిల్లాలో దారుణం,పుస్తకాలు తరలించేందుకు విద్యార్ధులను కూలీలుగా వాడుకున్న ప్రభుత్వ పాఠశాల సిబ్బంది

•పుస్తకాలు తరలించే ఆటో బోల్తా పడి తీవ్రంగా గాయపడిన నలుగురు విద్యార్థులు

నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండల సతాపూర్ గ్రామంలో 9వ తరగతి విద్యార్థులతో పాఠ్య పుస్తకాలను తరించిన జెడ్పీహెచ్ఎస్ సిబ్బంది,పుస్తకాలను తరలించే క్రమంలో ఆటో బోల్తాపడడంతో, తీవ్రంగా గాయపడిన అశోక్, కార్తీక్, నాని, శివ అనే నలుగురు విద్యార్థులు,గాయాలపాలైన విద్యార్థులలో శివ అనే బాలుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపిన వైద్యులు,ఈ ఘటనపై వివరణ అడగగా తనకు సంబంధం లేదని సమాధానం ఇవ్వడంతో, డీఈవోపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు..