MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 11 May 2026, 5:33 am Digital Edition : Medak Today

ఎన్ హెచ్.ఆర్.ఎస్. జె.సి. గోవా రాష్ట్ర అధ్యక్షుడిగా ఆనంద్ నియామకంవివాహ వేడుక వేదికగా నియామక పత్రం, ఐడీ కార్డు అందజేత.

(స్పెషల్ కరస్పాండెంట్)గోవా-హైదరాబాద్,మే,10,మెదక్ టుడే న్యూస్:
నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ కమిషన్ (ఎన్ హెచ్.ఆర్.ఎస్. జె.సి.) గోవా రాష్ట్ర అధ్యక్షుడిగా శ్రీ ఆనంద్‌ను నియమిస్తూ జాతీయ ఇంచార్జ్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సర్వేందర్ ఆధ్వర్యంలో నియామక పత్రం మరియు అధికారిక ఐడీ కార్డును ఘనంగా అందజేశారు. ఈ కార్యక్రమం నల్లగుట్ట విజయ్ బావమరిది కుమార్తె వివాహ వేడుక సందర్భంగా నిర్వహించబడటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వివాహ వేడుక అత్యంత వైభవంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ సుక్కా డానియల్, వర్కింగ్ ప్రెసిడెంట్ సగ్గు వేణు మాధవ్, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ దామోదర్ గుప్తా, వైస్ చైర్మన్ పి.ఎల్. రవీందర్ నాయుడు, జాతీయ కార్యదర్శి కె.పి. శ్రీనివాస్, స్టేట్ చైర్మన్ యాదవ రెడ్డి, ఆర్టీఐ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ కుమార్ ముదిరాజ్ పాల్గొని ఆనంద్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే రాష్ట్ర సభ్యులు రాజేందర్ నల్లారి, శ్రీమతి ప్రీతి, శ్రీమతి లత, ఆనంద్ సతీమణి శ్రీమతి అపర్ణ, శ్రీమతి ఉషా నాయుడు, సంస్థ అధికార ప్రతినిధి డాక్టర్ కొమ్ము వెంకన్నబాబు తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ సుక్కా డానియల్ మాట్లాడుతూ, “మానవ హక్కుల పరిరక్షణతో పాటు సామాజిక న్యాయం సాధనలో సంస్థ కీలక పాత్ర పోషిస్తోంది. గోవా రాష్ట్రంలో ఆనంద్ నాయకత్వంలో సంస్థ మరింత బలోపేతం అవుతుందని విశ్వసిస్తున్నాం” అని పేర్కొన్నారు.నూతన గోవా రాష్ట్ర అధ్యక్షుడు ఆనంద్ మాట్లాడుతూ, వచ్చే నెలలో గోవాలో రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభించి, కొత్త కమిటీని ఏర్పాటు చేసి సంస్థ సేవలను ప్రజలకు మరింత చేరువ చేస్తామని తెలిపారు. మానవ హక్కులు, సామాజిక న్యాయం కోసం కృషి చేయడమే తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు. గోవాలో నిర్వహించబోయే కార్యక్రమాలకు తన సోదరి పార్వతి, బావ విజయ్ కుమార్ నాయుడు పూర్తి సహకారం అందిస్తున్నారని పేర్కొన్నారు.సంస్థ అభివృద్ధికి అందరి సహకారం అవసరమని జాతీయ ఇంచార్జ్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సర్వేందర్ పేర్కొంటూ, గోవాలో సంస్థను మరింత విస్తరింపజేయాలని ఆకాంక్షించారు.