MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 24 July 2026, 4:06 am Digital Edition : Shiva Kumar

ముత్తంగి డివిజన్ కర్దనూర్ గ్రామంలో ప్రజలతో ముఖాముఖి: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శాపురం నరసింహారెడ్డి.

పటాన్‌చెరు,జూలై,23,మెదక్ టుడే న్యూస్:(ప్రతినిధి)సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నియోజకవర్గం పరిధిలోని ముత్తంగి డివిజన్ పరిధిలోని కర్దనూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శాపురం నరసింహారెడ్డి గ్రామ ప్రజలతో ప్రత్యేక ముఖాముఖి సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఓటరు జాబితా సవరణ ప్రత్యేక కార్యక్రమం గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఓటరు జాబితాలో ప్రతి అర్హులైన వ్యక్తి పేరు సక్రమంగా నమోదై ఉండేలా తగు సూచనలు చేశారు. ఓటరు నమోదుకు కావలసిన ధృవపత్రాలు, దరఖాస్తు చేసుకునే విధానం మరియు ఓటు హక్కు యొక్క ప్రాముఖ్యతను వివరించారు.అనంతరం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు మరియు ప్రజలకు అందిస్తున్న వివిధ పథకాలపై చర్చించారు. గ్రామ ప్రజల సమస్యలను ఓపికగా విని, వాటి పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తుందని భరోసా కల్పించారు.ఈ సందర్భంగా శాపురం నరసింహారెడ్డి మాట్లాడుతూ, “ప్రజలతో నిరంతరం మమేకమై వారి సమస్యలను తెలుసుకుంటూ, అభివృద్ధి మరియు సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ప్రతి గ్రామంలో ప్రజల భాగస్వామ్యంతో పార్టీని మరింత బలోపేతం చేస్తాం” అని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు మరియు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.