-మెదక్ ఎమ్మెల్యే మైనం పల్లి రోహిత్ రావ్
మెదక్,మార్చి,20,మెదక్ టుడే. న్యూస్:పవిత్రమైన రంజాన్ పండుగను పురస్కరించుకొని ముస్లిం లకు,నియోజకవర్గ ప్రజలకు మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావ్ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పవిత్ర మాసం మనుషుల మధ్య సౌహార్దం, సహనం, సేవాభావం, దాతృత్వం వంటి గొప్ప విలువలను పెంపొందించే పవిత్ర కాలమని ఆయన పేర్కొన్నారు.రంజాన్ నెలలో ముస్లిం సోదరులు ఆచరించే ఉపవాస దీక్షలు మనిషిలో ఆత్మ నియంత్రణను పెంపొందించడమే కాకుండా, సమాజంలో సమానత్వ భావనను బలపరుస్తాయని అన్నారు. పేదవారికి సహాయం చేయడం, పరస్పరం ప్రేమాభిమానాలు పెంచుకోవడం ద్వారా సమాజంలో ఐక్యత మరింత బలపడుతుందని ఆయన ఆకాంక్షించారు.ఈ పవిత్ర పండుగ ప్రతి ఇంటిలో ఆనందం, ఆరోగ్యం, శాంతి నింపాలని, ప్రజలందరికీ సుఖసంతోషాలు కలగాలని ఎమ్మెల్యే రోహిత్ రావ్ ప్రార్థించారు. రాష్ట్ర ప్రజలందరూ ఐకమత్యంతో ముందుకు సాగుతూ అభివృద్ధి పథంలో నడవాలని ఆయన కోరారు.