మెదక్ బల్దియా పై ఎగిరేది బిఆర్ఎస్ జండానే
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి.
మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మదేవేందర్ రెడ్డి..
మెదక్ జనవరి 30 మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి:మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మెదక్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. పట్టణంలోని పలు వార్డులకు చెందిన కాంగ్రెస్ నాయకులు శుక్రవారం మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బిఆర్ఎస్ లో చేరారు. ఎమ్మార్పీఎస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ హస్తకాల బాలరాజు వార్డ్ నెంబర్ 10 నుండి కాంగ్రెస్ నాయకులు చింతల శ్రీను, కిషన్, మంద శేఖర్ తో పాటు 20 మంది కార్యకర్తలు,మహిళలు కూడ అలాగే వార్డు నెం 27 నుండి పల్లె రాణి బాలరాజ్ లంతోపాటు 20 మంది కార్యకర్తలు, వార్డ్ నెంబర్ 31 ఆర్కే శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు వరాల. రాములు, రణధీర్ , కంచర్ల శ్రీధర్, యాదగిరి, నరేష్ మంగలి మహేష్, ఆకుల రాహుల్ పాటు 30 మంది కార్యకర్తలు పద్మ దేవేందర్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ లో చేరారు.వీరికి పద్మ దేవేందర్ రెడ్డి, మెదక్ మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్,మాజీ ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్ గులాభి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా పద్మ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ..బిఆర్ఎస్ లో చేరిన వారిని అభినందించి పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు. మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని పేర్కొన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన పథకాలు తప్ప ఈ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి ఒకటి కూడా నెరవేర్చలేదన్నారు. రానున్న కాలంలో బిఆర్ఎస్ ప్రభుత్వం రావాలని, మళ్లీ కేసిఆర్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. పార్టీలో యువకుల చేరికతో భవిష్యత్ రాజకీయాలకు శుభ పరిమాణమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఆరేళ్ల. మల్లికార్జున్ గౌడ్,పట్టణ పార్టీ కన్వీనర్ మామిళ్ళ.ఆంజనేయులు, మాజీ కౌన్సిలర్ ఆర్కే.శ్రీనివాస్, నాయకులు లింగా రెడ్డి,కండేల. నర్సింలు,కసాపురం మధు, శ్రీనివాస్ గౌడ్, కృష్ణ, కిరణ్,రవి భువన్,చంద్ పాషా తదితరులు ఉన్నారు.