ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం.
కొల్చారం,మే,22,(మెదక్ టుడే న్యూస్):కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి శుక్రవారం పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు మల్లేశం గౌడ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్మికులకు కనీస వేతనం 20వేలకు పెంచి కోటి 11 లక్షల మంది కార్మికులకు లబ్ధి చేకూర్చారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ముందుకు సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.