మెదక్,డిసెంబర్,22,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి,మెదక్ పట్టణంలోని సాయి దత్తా సినిమా థియేటర్ సమీపంలో కొనసాగుతున్న వంతెన నిర్మాణం వల్ల జరుగుతున్న ప్రమాదాలపై ప్రజల నుంచి వస్తున్న ఆందోళనను తాను గమనించినట్లు ఎమ్మెల్యే మినంపల్లి రోహిత్ అన్న తెలిపారు.ఈప్రాంతంలో సరైన భద్రతా చర్యలు లేకపోవడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకోవడం బాధాకరమని ఆయన అన్నారు.ఈవిషయంపై సంబంధిత ఇంజినీరింగ్ అధికారులు, మున్సిపల్ శాఖ మరియు పోలీసు అధికారులతో తక్షణమే సమావేశం నిర్వహించి, సమస్యకు శాశ్వత పరిష్కారం తీసుకువస్తామని ఎమ్మెల్యే తెలిపారు. వంతెన నిర్మాణ ప్రాంతంలో తగిన భద్రతా సూచికలు, బ్యారికేడ్లు ఏర్పాటు చేయడం, రాత్రివేళ తగిన లైటింగ్ ఏర్పాటు చేయడం మరియు ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రత్యేకంగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశిస్తామని అన్నారు.ఇప్పటికే జరిగిన ప్రమాదాల్లో గాయపడిన వారందరికీ సరైన వైద్య సహాయం అందేలా చూస్తామని, బాధిత కుటుంబాలకు అవసరమైన సహకారం అందిస్తామని ఎమ్మెల్యే మినంపల్లి రోహిత్ అన్న భరోసా ఇచ్చారు. ప్రజల ప్రాణాల భద్రతే తమకు అత్యంత ముఖ్యమని, ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని చర్యలుతీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.మెదక్ ప్రజలుఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తానే ఈ అంశాన్ని వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తూ పూర్తిస్థాయి పరిష్కారం జరిగే వరకు చర్యలు కొనసాగిస్తానని ఎమ్మెల్యే మినంపల్లి రోహిత్ అన్న తెలిపారు.
మెదక్ పట్టణంలోని సాయి దత్తా సినిమా థియేటర్ సమీపంలో కొనసాగుతున్న వంతెన నిర్మాణం వల్ల జరుగుతున్న ప్రమాదాలపై ప్రజల నుంచి వస్తున్న ఆందోళనను తాను గమనించినట్లు ఎమ్మెల్యే మినంపల్లి రోహిత్ అన్న తెలిపారు.
RELATED ARTICLES
