📄 ePaper
Tuesday, March 10, 2026
ADS
HomePOITICAL NEWSమెదక్ మున్సిపాలిటీ నీ సుందరనందనవనంగా తీర్చిదిద్దే బాధ్యత నాదేమెదక్ ఎమ్మెల్యే...

మెదక్ మున్సిపాలిటీ నీ సుందరనందనవనంగా తీర్చిదిద్దే బాధ్యత నాదేమెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనం పల్లి రోహిత్ రావ్

📰 Generate e-Paper Clip

మెదక్ డిసెంబర్ 1 మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన లు ప్రారంభోత్సవాలు చేసిన ఎమ్మెల్యే
మెదక్ మున్సిపాలిటీ అభివృద్ధి వైపు దూసుకెళ్తుందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనం పల్లి రోహిత్ రావ్ తెలిపారు. సోమవారం మెదక్ పట్టణంలోని 7,8,20 వార్డులలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన లు ప్రారంభోత్సవాలు చేశారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మెదక్ పట్టణాన్ని సుందరనందనవనంగా తీర్చిదిద్దే బాధ్యత తనదేనా
న్నారు.ఇటీవల పట్టణాభివృద్ధి కోసం రూ టియూఎఫ్ఐడిసి ద్వారా రూ 55కోట్లు వచ్చాయని, వాటిని సైతం త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం విషయంలో ఏలాంటి రాజీలేదని, నియోజకవర్గ అభివృద్ధియే తన ఆకాంక్ష అని ఎమ్మెల్యే తెలిపారు. రెండేళ్ల తమ ప్రభుత్వ పాలనలో నియోజకవర్గానికి కోట్లాది రూపాయల నిధులు తీసుకొచ్చామన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని నిధులు తెచ్చి మెదక్ మున్సిపాలిటీ నీ అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం లో మున్సిపల్ మాజీ చైర్మన్ తొడుపునూరి చంద్రపాల్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మేడి మధుసూదన్ రావ్ మాజీ కౌన్సిలర్లు లక్ష్మీనారాయణ గౌడ్, మమత, శ్రీధర్ యాదవ్,దొంతి ముత్యం గౌడ్, లింగం హంజాద్, గంగాధర్,శివరామ కృష్ణ, పురం వెంకట నారాయణ హరిత నర్సింగ్ రావ్, బట్టి సులోచన, గోదల జ్యోతి, స్వరూప, దయా సాగర్, భానీ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, డిఈ మహేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular

Recent Comments