MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 10 November 2025, 5:12 pm Digital Edition : Medak Today

ప్రజావాణిలో ప్రజలు ఇచ్చిన దరఖాస్తులు పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ ఆదేశించారు.

•సమస్య పరిష్కరించాలని
ప్రజావాణిలో ప్రజలు ఇచ్చిన దరఖాస్తులు పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ ఆదేశించారు.

మెదక్ నవంబర్ 10 మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి

సోమవారం ఐడిఓసీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ పాల్గొని జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించి సంబంధిత శాఖల అధికారులకు పరిష్కార నిమిత్తం పంపించారు.
ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో 75 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. అందులో భూ భారతి 34,పెన్షన్14 ,ఇందిరమ్మ ఇండ్లు 5,ఇతర 26 దరఖాస్తులు వచ్చాయన్నారు.
సమస్యలను విని వెంటనే పరిష్కారం చూపించడం లక్ష్యంగా ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్ తెలిపారు.ప్రజావాణికి వచ్చిన 75 మంది దరఖాస్తుదారులతో కలెక్టర్, మీ సమస్య చెప్పండని అడిగి తెలుసుకుని దరఖాస్తు పరిష్కారం నిమిత్తం సంబంధిత అధికారులకు ఎండార్స్మెంట్ చేస్తున్నట్లు తెలిపారు. దరఖాస్తులను సమయానికి పరిష్కరించడం అన్ని శాఖల బాధ్యత అని ఆయన తెలిపారు. ప్రతి ఫిర్యాదును జాగ్రత్తగా నమోదు చేసి, పరిష్కారం వరకు అధికారులు పర్యవేక్షించాలని,
అవసరమైతే ఫీల్డ్ పరిశీలనలు కూడా చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జెడ్పి సీఈఓ ఎల్లయ్య, డిఆర్డిఓ శ్రీనివాసరావు, డిఆర్ఓ భుజంగరావు,అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.