📄 ePaper
Wednesday, March 11, 2026
ADS
HomePanchayati ennakaluముగిసిన నామినేషన్ల పర్వం..

ముగిసిన నామినేషన్ల పర్వం..

📰 Generate e-Paper Clip

ముగిసిన నామినేషన్ల పర్వం

పాపన్నపేట,నవంబర్,29,మెదక్ టుడే న్యూస్:

పాపన్నపేట మండల పరిధి లోని వివిధ గ్రామాలకు చెందిన సర్పంచ్,వార్డ్ మెంబర్ స్థానాలు ఆశిస్తున్న ఆశావాహులతో మండల కేంద్రమైన పాపన్నపేట నామినేషన్ల పర్వం తో కిటకిటలాడింది. మెదక్ జిల్లా లోనే అతిపెద్ద మండలం గా పేరుగాంచిన పాపన్నపేటలో 40 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 348 వార్డులు ఉన్నాయి. శనివారం నామినేషన్ల ముగింపుకు తుదిఘట్టం కావడంతో మండల పరిధిలోని దాదాపు అన్ని గ్రామాలకు చెందిన సర్పంచ్ వార్డ్ మెంబర్ ఆశిస్తున్న ఆశావహులు తమ అనుచరాగణంతో చేరుకొని నామినేషన్లు వేశారు. అయితే ఆశావాహులు పెద్ద సంఖ్యలో రావడంతో రాత్రి అయినప్పటికీ నామినేషన్లను దరఖాస్తు చేసుకోవడానికి సమయం సరిపోలేదు. దీంతో వారికి టోకెన్లను ఇచ్చారు,రాత్రి అయిన నామినేషన్లు తీసుకుంటామని సంబంధిత అధికారులు వెల్లడించారు. అయితే సుమారు రాత్రి 9 నుంచి 10 గంటల వరకు నామినేషన్లు స్వీకరించడానికి సమయం పట్టవచ్చు అని సంబంధిత అధికారులు వెల్లడించారు. దీంతో వివిధ గ్రామాల నుంచి డప్పు చప్పులు బాజా బాజన్త్రీలతో పాపన్నపేటకు చేరుకున్న పోటీలో ఉన్న అభ్యర్థులతో పాటు అభిమానులతో పాపన్నపేట సందడిగా మారింది.

RELATED ARTICLES
- Advertisment -ADS

Most Popular

Recent Comments