MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 29 November 2025, 8:13 am Digital Edition : Medak Today

మెదక్ జిల్లా/నామినేషన్ల చివరి రోజు అధికారుల అప్రమత్తంగా ఉండాలి-జిల్లా ఎన్నికల అధికారి ,కలెక్టర్ రాహుల్ రాజ్..

పాపన్నపేట,నవంబర్,29,మెదక్ టుడే న్యూస్:

శనివారం నామినేషన్ల చివరి రోజు అధికారుల అప్రమత్తంగా ఉండాలి,జిల్లా ఎన్నికల అధికారి ,కలెక్టర్ రాహుల్ రాజ్..గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి దశ నామినేషన్ల స్వీకరణకు ఇవాళే (29.11.2025) చివరి రోజు కావడంతో నామినేషన్లు దాఖలు చేసేందుకు అభ్యర్థులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున రిటర్నింగ్ అధికారులు నామినేషన్లు స్వీకరణకు నామినేషన్ పత్రాలు, హెల్ప్ డెస్క్ లతో సిద్ధంగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు.కలెక్టర్ క్యాంపస్ నుండి టెలి కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు పలు సలహాలు సూచనలు అందించారు.ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరణకు సమయం ఉందని, అభ్యర్థులు నిర్దేశించిన సమయంలోగా నామినేషన్లు వేసుకోవాలని సూచించారు.నామినేషన్ కేంద్రాల్లో అవసరమైన సౌకర్యాలు, మార్గదర్శకాలు, రద్దీ నియంత్రణ చర్యలకు అన్ని ఏర్పాట్లుతో సిద్ధంగా ఉంచాలని ఆయన సూచించారు.టెలికాన్ఫరెన్స్లో ఆర్డీవోలు ఎంపీడీవోలు ఆర్వోలు ఏఆర్వోలు ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.