మెదక్,నవంబర్,15,మెదక్ టుడే న్యూస్:
ఆదివాసీ సమాజానికి మార్గదర్శి బిర్సా ముండాజిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్..
భగవాన్ బిర్సా ముండా 150వ జయంతిని స్థానిక కలెక్టర్ కార్యాలయంలో సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ,అదనపు కలెక్టర్ నగేష్ ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు.బిర్సా ముండా చిత్రపటానికి పూలమాలు వేసి, జ్యోతి వెలిగించి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ,
భారత దేశాలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా గిరిజన హక్కుల కోసం పోరాడిన మహానాయకుడు బిర్సా ముండా త్యాగాలను, ఆదర్శాలను గుర్తుచేశారు.
ఆయన జీవితమే ఆదివాసీ హక్కుల సాధనకు, స్వాతంత్ర్య పోరాటానికి స్పూర్తి దాయకం అన్నారు.
బిర్సా ముండా పోరాటం భారతదేశ స్వాతంత్ర్య సమరయోధుల్లో ఒక వినూత్న ఘట్టంగా చరిత్రలో నిలిచిపొతరన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిసిఓ ఎల్లయ్య ట్రైబల్ వెల్ఫేర్ అధికారి నీలిమ, విద్యార్థులు, సిబ్బంది దళితులు పాల్గొన్నారు.
