మందిరాల వద్ద పరిశుభ్రత.
కొల్చారం,మే,22,మెదక్ టుడే న్యూస్:ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం పర్యాటక వారోత్సవాలలో భాగంగా కొల్చారం సర్పంచ్ దేవన్న గారి శేఖర్ ఆధ్వర్యంలో స్థానిక షేక్ షాబుద్దీన్ దర్గా, తిరుమలయ్య స్వామి, లక్ష్మణ ఆలయాల వద్ద పారిశుద్ధ్య పనులు నిర్వహించారు. ఆలయ ప్రాంగణాలలో ఉన్న చెత్తాచెదారం, గడ్డి మొక్కలు, మురికిని శుభ్రం చేశారు. ఈ కార్యక్రమంలో కారోబార్ వడ్ల ప్రభాకర్, వార్డు మెంబర్లు, పారిశుద్ధ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.