MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 02 February 2026, 6:44 am Digital Edition : SHIVA KUMAR

మంబోజీపల్లి గ్రామంలో బిఆర్ఎస్ నాయకుడు గంజి నవీన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం.

మెదక్ రూరల్,ఫిబ్రవరి,1,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి.బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిపై కాంగ్రెస్ సర్కార్ రాజకీయ వేధింపులకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మొదలైన నిరసనలు.కేసీఆర్ ని ముట్టుకుంటే రాష్ట్రం అగ్నిగుండంలా మారుతుందని రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసి హెచ్చరించిన గులాబీ సైన్యంపాలన చేతగాక, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక, ప్రజల దృష్టి మళ్లించడానికి కేసీఆర్ గారిపై రాజకీయ వేధింపులకు పాల్పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంకేసీఆర్ గారి జోలికి వస్తే రేవంత్ రెడ్డిని, ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొందపెట్టడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా ఉన్నది ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు గంజి నవీన్ కుమ్మరి రమేష్ ,గంజి శ్రీకాంత్,మ్యకల శేఖర్,గోపని సాయి, చిట్యాల శేఖర్, మహేందర్ ,నాగరాజు,వంశీ, సాయినందు,సురేందర్, జితూ, బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.