(స్టేట్ బ్యూరో)మహబూబా బాద్, జిల్లా నవంబర్ 11 మెదక్ టుడే న్యూస్
కొడుకును కాపాడేందుకు వెళ్లిన తల్లిపై కత్తితో దాడి.మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం కొమ్ములవంచ గ్రామంలో కొడుకును కత్తితో పొడుస్తున్నాడని అడ్డుకోబోయిన తల్లిని కూడా కత్తితో పొడిచిన ఘటన కలకలం రేపింది. బూరుగండ్ల రవి, పారునంది అర్జున్ ల మధ్య జరిగిన ఘర్షణలో రవి, అర్జున్ ను పొడుస్తుండగా, అడ్డుకోబోయిన అర్జున్ తల్లి సునీతను కూడా రవి కత్తితో పొడిచాడు. తీవ్రగాయాలైన తల్లి, కొడుకులను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. వ్యక్తిగత పాతకక్షలే ఈ ఘర్షణకు కారణమని గ్రామస్తులు తెలిపారు.