పాపన్నపేట,ఫిబ్రవరి,4,మెదక్ టుడే న్యూస్:ఆధ్యాత్మిక శోభతో ఘనంగా ఏడుపాయల వనదుర్గ అమ్మవారి మహా శివరాత్రి జాతర నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులు ఆదేశించారు.మహాశివరాత్రి ఏడుపాయల వనదుర్గ అమ్మవారి జాతర ఘనంగా జరిగేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు,గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని భక్తులకు అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు.

మహాశివరాత్రి జాతర ఆధ్యాత్మిక శోభతో ఘనంగా నిర్వహించేందుకు కట్టుదిట్టంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సంబంధిత అధికారులను ఆదేశించారు.బుధవారం మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గ అమ్మవారి జాతర పరిసర ప్రాంతాలను వనదుర్గ అమ్మవారి పరిసర ప్రాంతాలను పరిశీలించిన అనంతరం జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో జాతర ఏర్పాట్లపై సమీక్షించారు.ఫిబ్రవరి 15 నుంచి 17 వరకు 3 రోజుల పాటు ఏడుపాయల జాతర వేడుకలను అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నట్లు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కల్గకుండా జాతర నిర్వహించాల్సి ఉంటుందని, నిర్దేశించుకున్న పనులను జాతర సమయానికి సన్నద్ధమయ్యే విధంగా వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.ఈసందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ*ఏడుపాయల అమ్మవారి క్షేత్రంలో మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్వహించే జాతర ఆధ్యాత్మికంగా, దైవికంగా నిబంధనలు పాటిస్తూ, ఎక్కడ ఎలాంటి లోపాలు జరగకుండా నిర్వహించాలని అధికారులకు సూచించారు.ఏడుపాయల ఆలయంలో జరిగే పూజలలో ఎలాంటి లోపాలు ఉండకుండా చూడాలని, శాస్త్రపరంగా అమ్మవారి పూజలు ఘనంగా జరగాలని, భక్తులకు త్వరగా దర్శనం లభించే విధంగా చర్యలు తీసుకోవాలని, జాతర నిర్వహణకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.
ఏడుపాయల మహాశివరాత్రి జాతర సందర్భంగా ఎక్కువ బస్సు సర్వీసులు నడపాలని, జాతరకు ఎక్కువ భక్తులు వచ్చే అవకాశం ఉందని, భక్తుల రద్దీ ఆధారంగా డిపో మేనేజర్లు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ అవసరమైన రోడ్లలో అదనపు సర్వీసులు నడపాలని సూచించారు.జాతర సందర్భంగా వచ్చే భక్తులకు త్రాగునీటి ఇబ్బందులు కలక్కుండా ఎక్కడికక్కడ త్రాగునీటి సదుపాయాలను ఏర్పాటు చేయాలని అన్నారు. ఆలయ పరిసరంలో అపరిశుభ్రత కాకుండా మూడు షిఫ్ట్ లో పారిశుధ్య సిబ్బంది విధులు నిర్వహించాలని పేర్కొన్నారు.జాతర సందర్భంగా వైద్య క్యాంపులు ఏర్పాటు చేయాలని, నిరంతర విద్యుత్ సరఫరా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, ముఖ్యమైన ప్రదేశాలలో అన్ని పందిళ్ళ వద్ద మంటలు ఆర్పే ఫైర్ యంత్రాలను ఏర్పాటు చేయాలని అన్నారు.జాతరను పర్యవేక్షించేందుకు అన్ని శాఖల అధికారుల నోడల్ ఆఫీసర్ల సమన్వయంతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని, భక్తుల కోసం ఎక్కడికక్కడ హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేయాలని సూచించారు.గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని భక్తులు మెచ్చేలా ఏర్పాటు చేసినట్లు వివరించారు.
మత్స్య శాఖ ఆధ్వర్యంలో 150మంది గజ ఈతగాళ్లు
2 ఫైర్ డిపార్ట్మెంట్ ద్వారా అగ్నిమాపక వాహనాలు, ఒక ద్విచక్ర వాహనం అందుబాటులో ఉంచుతున్నారు.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ద్వారా 5 ప్రదేశాలలో క్యాంప్ లు, నాలుగు 108 అంబులెన్సు లు,లక్ష వో ఆర్ ఎస్ ప్యాకెట్ లు, మందులు, అంత్యవసర మందులు,28 మంది డాక్టర్లు, డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ 4, 80 మంది ఆయుష్ డాక్టర్లు, ఏఎన్ఎంలు100, ఇతర వైద్య సిబ్బంది మొత్తం 300 మంది పనిచేస్తారని తెలిపారు.
ఆర్టీసీ ద్వారా ప్రతి రోజు వివిధ రూట్లలో 140 బస్సులు మూడు రోజుల పాటు మొత్తం 420 బస్సులు నడుస్తాయని తెలిపారు.
టేకుల గడ్డ బస్టాండ్ నుండి 10 ఉచిత మినీ బస్సులు తిరుగుతాయి తెలిపారు.

ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో 9 సంచార బృందాలు, 2 చెక్ పోస్టులు,
మిషన్ భగీరథ, ఆర్డబ్ల్యూఎస్ శాఖల సమన్వయంతో 144 నల్లాలు, 45 మంది మానిటరింగ్ చేస్తారని,400 మంది కార్మికులు,498 మరుగు దొడ్లు, వాటర్ ట్యాంకర్లు 40, ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.జిల్లా పంచాయతీ శాఖ ద్వారా 18 మంది సెక్టార్ అధికారులు,180 మంది పంచాయతీ కార్యదర్శులు,640 మంది మల్టీ పర్పస్ కార్మికులు,రెండు షిఫ్ట్లలో పని చేయనున్నారు .13 తేదీ నుంచి 18 వ తేదీ వరకు పనులు చేయనున్నారు. డస్ట్ బిన్స్, బ్లీచింగ్ పౌడర్, పాగింగ్ చేయనున్నారు.
పోలీసు బందోబస్తు…

జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు 04 డీఎస్పీలు, 23 మంది సీఐలు, 80మంది ఎస్సైలు, 45మంది ఏఎస్సైలు, 96మంది హెడ్ కానిస్టేబుళ్ళు, 250 మంది కానిస్టేబుళ్లు, 84 మంది మహిళా కానిస్టేబుళ్లు, 234 మంది హోంగార్డులు, 14మంది మహిళా హోంగార్డులు మొత్తం 829 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారని తెలిపారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నగేష్, ఆర్డీవోలు మెదక్ రమాదేవి, నర్సాపూర్ మహిపాల్ రెడ్డి, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డిపిఓ యాదయ్య, నాగ్సన్పల్లి సర్పంచ్ సుశీల, ఆలయ కార్య నిర్వహణ అధికారి, వీరేశం, తాసిల్దార్ సతీష్ కుమార్, కొల్చారం తాసిల్దార్ శ్రీనివాస చారి, వివిధ శాఖల జిల్లా అధికారులుఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

