మధురానగర్ లో సెట్బ్యాక్స్ గాలికొదిలి.. అనుమతులు లేని షట్టర్లు..అధికారుల మౌనం వెనుక మతలబు ఏంటి?
అమీన్ పూర్,ఆగస్టు,14,మెదక్ టుడే న్యూస్:(ప్రతినిధి)సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ జీహెచ్ఎంసీ పరిధిలోని బీరంగూడ డివిజన్ పరిధిలోని మధురా నగర్ కాలనీలో బిల్డర్లు నిబంధనలను కాలరాస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. సెట్ బ్యాక్స్ వదలకుండా, ఎలాంటి అనుమతులు లేని అనధికార షట్టర్లను సైతం యథేచ్ఛగా నిర్మిస్తుండటంతో స్థానిక కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.అధికారుల తీరుపై స్థానికుల ఆగ్రహం,సామాన్యులు చిన్నపాటి ఇల్లు కట్టుకోవడానికి ప్రయత్నిస్తే చాలు… వెంటనే రంగ ప్రవేశం చేసే టౌన్ ప్లానింగ్ అధికారులు, నిర్మాణాలను ఆపేసి హడావుడి చేస్తుంటారు. కానీ, కోట్లు విలువ చేసే అక్రమ నిర్మాణాలను, అనుమతులు లేని షట్టర్లను బిల్డర్లు కడుతుంటే మాత్రం అధికారులు కనీసం కన్నెత్తి కూడా చూడకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.అక్రమాలకు అధికారులే మద్దతా?బిల్డర్లు ఇంత బరితెగించి నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేస్తుంటే టౌన్ ప్లానింగ్ అధికారులు ఎందుకు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు, కాలనీవాసులు నిలదీస్తున్నారు. అధికారుల ఉదాసీన వైఖరి చూస్తుంటే.అక్రమ నిర్మాణాలకు వారే పరోక్షంగా మద్దతు ఇస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయని తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.*తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్,ఇప్పటికైనా జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు స్పందించి, మయూరి నగర్ కాలనీలో నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న అనధికార షట్టర్లు మరియు నిర్మాణాలపై విచారణ జరపాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అక్రమ నిర్మాణాలను వెంటనే కూల్చివేయాలని, లంచాలకు అలవాటు పడి చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులపై శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు హెచ్చరిస్తున్నారు. లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని స్పష్టం చేశారు.
