చేగుంట,డిసెంబర్,1,మెదక్ టుడే న్యూస్:
లయన్స్ క్లబ్ ఆఫ్ చేగుంట ఆధ్వర్యంలో తేదీ 01డిసెంబర్ 2025 రోజున ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా చేగుంట లోని స్థానిక శ్రీకృష్ణవేణి టాలెంట్ స్కూల్, విద్యార్థిని విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ..ఈ సదస్సులో ఎయిడ్స్ సంక్రమించే మార్గాలు వాటిని నిర్మూలించే విధానాలు విద్యార్థి విద్యార్థులకు అర్థమయ్యే విధంగా బోధించడం జరిగింది .అలాగే విద్యార్థులు కూడా ఈ వ్యాధి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు వారి ఉపన్యాసాలతో వివరించారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ శంభుని శ్రీనివాస్ క్లబ్ సెక్రటరీ పులబోయిన నాగరాజు ,క్లబ్ డి.ఎస్ ద్యావ లింగమూర్తి, పాఠశాల ప్రిన్సిపాల్ ద్యావ రేణుక లింగమూర్తి మరియు ఉపాధ్యాయ బృందం విద్యార్థులు పాల్గొన్నారు.
