పాపన్నపేట,జూలై,21,(మెదక్ టుడే న్యూస్)
మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని కుర్తివాడ గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం 3 గంటల నుంచి ఏడీ మైన్స్, ఆర్ఐ-ఏడీ మైన్స్ పాపన్నపేట రెవిన్యూ అధికారులు పోలీసు సిబ్బంది సంయుక్తంగా విస్తృత తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీల్లో గ్రామంలోని 29 వేర్వేరు ప్రాంతాల్లో అక్రమంగా నిల్వ ఉంచిన ఇసుకను గుర్తించారు.మొత్తం 154 ట్రాక్టర్ ట్రిప్పులకు సమానమైన ఇసుక అక్రమంగా నిల్వ చేసినట్లు ఏడీ మైన్స్ అధికారులు అంచనా వేశారు.గుర్తించిన ఇసుకను అధికారులు సీజ్ చేసి, కుర్తివాడ గ్రామ పాలనాధికారి(జీపీవో) ఆధీనంలో ఉంచారు. అక్రమ ఇసుక నిల్వలపై తదుపరి చర్యలు మైనింగ్ శాఖ నిబంధనల ప్రకారం చేపడతామని అధికారులు తెలిపారు.