MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 02 February 2026, 6:28 am Digital Edition : SHIVA KUMAR

కూచన్ పల్లీ గ్రామంలో బిఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం.

హవేలి ఘనపూర్,ఫిబ్రవరి,1,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి.బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ సర్కార్ రాజకీయ వేధింపులకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మొదలైన నిరసనలు.కేసీఆర్ ని ముట్టుకుంటే రాష్ట్రం అగ్నిగుండంలా మారుతుందని రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసి హెచ్చరించిన గులాబీ సైన్యం.
పాలన చేతగాక, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక, ప్రజల దృష్టి మళ్లించడానికి కేసీఆర్ కు సీట్ నోటీసులు పంపడం పై రాజకీయ వేధింపులకు పాల్పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంకేసీఆర్ జోలికి వస్తే రేవంత్ రెడ్డిని, ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొందపెట్టడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా ఉన్నది అని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో బి ఆర్ఎస్ సీనియర్ నాయకులు లింగంపల్లి శేఖర్ రెడ్డి, బయన్న, మద్దెల భాస్కర్ వాడు నెంబర్లు మన్నె.శివకుమార్, లింగంపల్లి శ్రీనివాస్, , రమేష్, కృష్ణ, రామకృష్ణ, బాలు, చాంద్ పాషా, యాదగిరి, పవన్, మరియుకార్యకర్తలు పాల్గొన్నారు.