చేగుంట,మార్చి,16,మెదక్ టుడే న్యూస్:చేగుంట క్రికెట్ క్రీడాకారులు కామారెడ్డి జిల్లా తిప్పాపూర్ గ్రామంలో టోర్నమెంట్లో చేగుంట టీం గెలుపొందడం జరిగినది. ఫైనల్ లో చేగుంట టీం 122 పరుగులు మొదటి బ్యాటింగ్ చేయగా,తిప్పాపూర్ 62 పరుగులు మాత్రమే చేసి ఓడిపోవడం జరిగింది.చేగుంట టీం భారీ విజయం నమోదు చేసుకుంది. గెలుపొందిన క్రీడాకారులను చేగుంట ఉపసర్పంచ్ మొహమ్మద్ రఫీ అభినందించారు వారు మాట్లాడుతూ చేగుంట కి ముందు ముందు ఇంకా క్రికెట్లో ముందుకు వెళ్లి విజయాలు సాధించాలి మన చేగుంట పేరు ప్రపంచమంతా తెలిసే విధంగా యువకులు ముందుకు సాగాలి యువకులు మత్తుకు బానిస కాకూడదు, మంచి విషయాలు నేర్చుకోండి మంచి పేరు తెచ్చుకోండి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలి అని వారు యువకులను ప్రోత్సహించడం జరిగినది. ఈ ఫైనల్లో బెస్ట్ బ్యాట్మెన్ ముఖిద్ ప్రకటించడం జరిగినది.చేగుంట టీం కెప్టెన్, మహేష్, ప్రవీణ్,నవీన్, ముఖి ద్ సల్మాన్,మహేష్,వినయ్, శంకర్,బాబు, యశ్వంత్,చింటూ,సాయి,తేజ,చరణ్,క్రీడాకారులు ఆడి గెలవడం జరిగినది గెలిచిన టీముని చేగుంట మండల ఉపసర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మహమ్మద్ రఫీ అభినందించాడు,
