కాన్సర్ కు రక్షణ హెచ్.పి.వి టీకా : వైద్యాధికారి అన్వర్

పాపన్నపేట,ఏప్రిల్,6,మెదక్ టుడే న్యూస్: 9 నుండి 14 సంవత్సరాల బాలికలకు ఉచిత హెచ్.పి.వి టీకాలు అందుబాటులో ఉన్నాయని వైద్యాధికారి అన్వర్ తెలిపారు. సోమవారం పాపన్నపేట ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెచ్.పి.వి టీకాల కార్యక్రమాన్ని సర్పంచ్ పావని నరేందర్ గౌడ్ తో కలిసి ప్రారంభించారు. గర్భశయ ముఖద్వారా క్యాన్సర్ నివారణకు ఈ టీకా తోడ్పడుతుందన్నారు. తొలి రోజు 16 మంది బాలికలకు ఈ టీకాలు వేశారు. తహశీల్దార్ సతీష్ కుమార్,ఎంపీడీఓ విష్ణువర్ధన్,హెల్త్ సిబ్బంది రాజశ్రీ,ఉపసర్పంచ్ సద్దామ్ హుస్సేన్ తదితరులు ఉన్నారు.