పాపన్నపేట,ఫిబ్రవరి,24,మెదక్ టుడే న్యూస్:మండల కేంద్రం పాపన్నపేటలో బోనాల ఊరేగింపు కన్నుల పండువగా సాగింది. మంగళవారం రేణుక ఎల్లమ్మ ఆలయంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికీ విశేష పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అమ్మవారికీ పిండి వంటలు నైవేద్యంగా సమర్పించారు. సాయంత్రం మహిళాలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి బోనాల ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. హైదరాబాద్ నుండి గ్రామస్తులు,బంధువుల రాకతో ఆలయం ప్రాంగణం సందడి నెలకొంది.
