మెదక్ మున్సిపాలిటి 14 వ వార్డు,15 వ వార్డ్ కాంగ్రెస్ అభ్యర్థులు
మెదక్ టౌన్ జనవరి 30 మెదక్ టుడే న్యూస్ ప్రతినిధి,మెదక్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ 14 వ వార్డు అభ్యర్థిగా దొంతి లక్ష్మి 15వ వార్డు అభ్యర్థి దొంతి నరేష్ గౌడ్ నామినేషన్ వేశారు అనంతరం వారుమాట్లాడుతూ పట్టణంలోని 14వ వార్డు 15వ వార్డు ఓటర్ మహాశయులందరికి దొంతి లక్ష్మి రెండవసారి 14వ వార్డు కౌన్సిల్గా గెలుపొందారు మళ్ళీ మూడవ సరి మీ ముందుకు వస్తున్నాను వార్డు ఓటర్ మహాశయులకు నన్ను రెండు పర్యాయాలు గెలుపొందించి మూడవసారి కూడా తన అమూల్యమైన ఓటు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించగలరని దొంతి లక్ష్మి 14 వ వార్డు ఓటర్లను కోరారు 15వ వార్డు అభ్యర్థి దొంతి నరేష్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సహకారంతో కౌన్సిలర్ గా పోటీ చేస్తూ మీ ముందుకి వస్తున్నాము అని తెలిపారు. మెదక్ పట్టణంలో 15వ గతంలో కౌన్సిలర్ గా పని చేసిన వారు అభివృద్ధిలో వెనుకబడ్డారు అని అన్నారు ఒకసారి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అవకాశం ఇవ్వండి అని కోరారు స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు సహకారంతో ఎమ్మెల్యే నుంచి వచ్చే నిధులు 14వ వార్డ్ 15వ వార్డు లలో ప్రతి పైసా జవాబుదారితనముగా ఉపయోగిస్తాము అని తెలిపారు. ఉన్న ప్రతి సమస్యను తీర్చడంలో ముందుంటాము అని తెలిపారు. ఉన్న ఓటరు మహాశయులకు విన్నవించేది ఒక్కసారి ఆలోచించండి, మీరు వేసే ఓటు ప్రగతికి బాటగా నిలుస్తుంది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పట్టణాలు పల్లెలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయి. అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నాయి మన పట్టణాన్ని కూడా అభివృద్ధి దిశగా అడుగులు వేద్దాం. కాంగ్రెస్ పార్టీ పట్టణాలను వేగంగా అభివృద్ధి చేస్తుంది మన మెదక్ పట్టణం కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ కి మీ ఓటు వేయండి అభివృద్ధిలో భాగస్వాములు కండి ఉన్న ప్రతి సమస్యను తీర్చడంలో మీ ముందుంటాము. పారిశుద్ధ సమస్య, నీటి సమస్య మౌలిక వసతులు కరెంటు సమస్య గృహము లేని వారికి గృహాలు అందివ్వడం, నిస్వార్ధంగా పనిచేసే వారికి పట్టం కట్టండి ప్రజాసేవకి అంకితం అవుతామని అన్నారు ఒకసారి అవకాశం ఇవ్వండి అభివృద్ధిని చేసి చూపిస్తాముఅని కాంగ్రెస్ అభ్యర్థులు దొంతి లక్ష్మి, దొంతి నరేష్ గౌడ్ ఓటర్లను కోరారు

