MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 05 May 2026, 2:20 pm Digital Edition : SHIVA KUMAR

కళ్యాణ లక్ష్మి పేదింటి ఆడబిడ్డలకు వరం-చెక్కుల పంపిణీ చేసిన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్.

మెదక్,మే,5,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి, రామాయంపేట మండల కేంద్రంలో ని తాసిల్దార్ కార్యాలయంలో మంగళవారం మెదక్ శాసనసభ్యులు మైనంపల్లి రోహిత్ రావు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.రామాయంపేట మండలంలో మొత్తం 96 చెక్కలకు గాను 96,11,136 కోట్ల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు అందించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కళ్యాణ లక్ష్మి పేదింటి ఆడబిడ్డలకు ఒక వరమని పేద కుటుంబాలపై పెళ్లి భారాన్ని తగ్గించడం కోసమే కల్యాణ లక్ష్మి పథకం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు.