•జిల్లా వ్యాప్తంగా ఆరోగ్య సేవలు మెరుగుదల కలెక్టర్
•24/7 నిరంతర వైద్య సేవలు
•ఆరోగ్య సేవలు పటిష్ట పర్యవేక్షణకు
కలెక్టరేట్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు
•మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్,శంకరంపేట,(ఆర్)నవంబర్,16,మెదక్ టుడే న్యూస్:ప్రతినిధి
జిల్లావ్యాప్తంగా రోగులకు మెరుగైన వైద్య సేవలు దిశగా వైద్యాధికారులు పనిచేస్తున్నారని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు.ఆదివారం శంకరపేట (ఆర్) మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.హాజర పుస్తకాలు, మందులు, స్టాక్ బోర్డులను నిషితంగా పరిశీలించారు. వైద్య సేవలపై రోగులను ఆరా తీశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ పేదలందరికీ ఉచిత నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయని, వైద్యాధికారులు
సమయపాలన కచ్చితంగా పాటిస్తూ
విధులకు హాజరవుతున్నారని తద్వారా రోగులకు వైద్య సేవలు అందించగలుగుతున్నామన్నారు.
జిల్లాలో ఆస్పత్రులు సిబ్బంది మెరుగయ్యాయని తెలిపారు.జిల్లాలో ఉన్న అన్ని ఆసుపత్రులు, వైద్య ఆరోగ్య కేంద్రాలను జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి సీసీటీవీ కెమెరాల ద్వారా మానిటరింగ్ చేస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా వైద్య వృత్తి పేరిట నకిలీలు ఉంటే తట్టరీత్యా శిక్షిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.