(స్టేట్ బ్యూరో)డిసెంబర్,31,మెదక్ టుడే న్యూస్: తెలంగాణలోని అన్ని జర్నలిస్టుల సంఘాలతో సంప్రదింపులు జరిపిన తర్వాతనే అక్రెడిటేషన్, తదితర వ్యవహారాలపై ముందుకు వెళ్ళాలని భావిస్తునట్లు ముఖ్యమంత్రి ఛీప్ పిఆర్వో మల్సూర్ అన్నారు.రాష్ట్ర సచివాలయంలో బుధవారం తెలంగాణ జర్నలిస్టు సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ) సభ్యులతో ముఖ్యమంత్రి ఛీప్ పిఆర్వో మల్సూర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టు సంఘాల జేఏసీ మార్చిలో తలపెట్టిన ‘జర్నలిస్టుల జాతర’కు తప్పకుండా సహకరిస్తాని అన్నారు. తమకు అనేక కోణాలలో వివిధ సమస్యలు దృష్టికి వచ్చాయని, ప్రతి సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తుందని ఆయన చెప్పారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టు సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ) నేతలు కే.కోటేశ్వర్ రావు, అనంచిన్ని వెంకటేశ్వరరావు, బిఎల్ఎన్ చారి, కో-కన్వినర్ సి.హెచ్.వెంకటేశ్వర్లు, రాగుల శ్రవణ్, కో- ఆర్డినేటర్లు మల్లిఖార్జున్, షేక్ అహ్మద్ పాషా తదితరులు పాల్గొన్నారు.