MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 17 December 2025, 5:46 am Digital Edition : Medak Today

జర్నలిస్టులంటే చులకనా..! నిర్లక్ష్యమా..?: ఏపీఐజేఏ అధ్యక్షులు యం.రాజా

పల్నాడు జిల్లా,డిసెంబర్,17,మెదక్ టుడే న్యూస్:  మాచర్ల పట్టణంలో ఎంఆర్ఆర్ న్యూస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏపీఐజేఏ అధ్యక్షులు యం. రాజా మాట్లాడుతూ,జర్నలిస్ట్ అక్రిడేషన్ పేరు వింటేనే విరక్తి కలిగించేలా పాలకులు పనితీరు మనసుని కలచి వేస్తుందని,నిజమైన జర్నలిస్టులకు అన్యాయం జరుగుతుందని నిరంతరం కష్టపడే జర్నలిస్టుల మనోభావాలు దెబ్బతింటున్నాయని, ఎండనక వాననక కలం శ్రామికుడిగా ఎన్నో ఊడిదుడుకులు ఎదుర్కొని తాను సేకరించిన వాస్తవ కథనాలు ఎంతో బాధ్యతగా వ్యవహరించి సమాజాన్ని మేల్కొల్పే దిశగా అడుగులు వేస్తూ కొనసాగుతున్నప్పటికీ జర్నలిస్టులను గుర్తించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి అని ఆంధ్రప్రదేశ్ ఇండిపెండెంట్ జర్నలిస్టు అసోసియేషన్ అధ్యక్షులు యం.రాజా ఆవేదన వ్యక్తం చేశారు.చిన్న పత్రికలు, వార పత్రికలు మాస పత్రికలు, అనుమతి ఉన్న కేబుల్ ఛానెల్స్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అన్ని గుర్తింపులు ఉన్నప్పటికీ కేవలం యూట్యూబ్ ఛానెల్స్, పరిమితం అయ్యారని, అక్రిడేషన్ సమయంలోఎం.ఎస్.ఓలు పూటకు రేటు నిర్ణయించడాన్ని మానసిక ఒత్తిడికి గురవుతున్నారని తెలిపారు.పోటాపోటిగా ప్రతి అంశాన్ని అద్యాయనం చేస్తూ శాటిలైట్ ఛానెల్స్ కి ధీటుగా ప్రసారాలు చేస్తున్న, వివక్ష ఏంటని ఆంధ్రప్రదేశ్ ఇండిపెండెంట్ జర్నలిస్టు అసోసియేషన్ అధ్యక్షులు యం. రాజా సూటుగా ప్రశ్నించారు.కేబుల్ చానల్స్, యూట్యూబ్ ఛానల్స్ కు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా, సిఫారసు లెటర్స్ చెల్లుబాటులోకి అనుమతించరాదని విజ్ఞప్తి చేశారు, ఎవరో స్వార్ధవాల కోసం ఎవరో మెప్పు పొందడం కోసం అక్రిడేషన్ కమిటీ సభ్యులుగా కొనసాగితే చూస్తూ ఊరుకోమని ఆంధ్రప్రదేశ్ ఇండిపెండెంట్ జర్నలిస్టు అసోసియేషన్ అధ్యక్షులు యం. రాజా పేర్కొన్నారు.ఎన్ని ప్రభుత్వాలు మారినప్పటికీ జర్నలిస్టుల బ్రతుకుల్లో ఎటువంటి మార్పు లేదు, జిల్లా అక్రిడేషన్ కమిటీలో సభ్యుడుగా కొనసాగాలంటే,ఈజిల్లా స్థానికుడై ఉండాలి, రాష్ట్ర స్థాయిలో తప్ప జిల్లా స్థాయిలో ఏ నియోజకవర్గంలో అక్రిడేషన్ పొందకూడదని ఆంధ్రప్రదేశ్ ఇండిపెండెంట్ జర్నలిస్టు అసోసియేషన్ అధ్యక్షులు యం. రాజా సూచించారు.కాసులిస్తే పదవులు కట్టబెట్టడం ఒంటి చర్యలకు పాల్పడకూడదని ఎటువంటి క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్, భూ పంచాయతీల్లో సివిల్ ఆరోపణలు ఉండకూడదని,ఆంధ్రప్రదేశ్ ఇండిపెండెంట్ జర్నలిస్టు అసోసియేషన్ అధ్యక్షులు యం.రాజా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.మీడియా సంస్థ నిర్మాణాకర్తలకు సైతం ఎడిటర్లకు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఇన్ ఫుట్ ఎడిటర్, అవుట్ ఫుట్ ఎడిటర్లకు, స్టేట్ బ్యూరో చీఫ్, రీజనల్ కోఆర్డినేటర్స్ కు, జర్నలిస్టు అక్రిడేషన్ లేని పరిస్థితి ఏర్పడిందంటే, ఇది మీడియా స్వేచ్ఛపై పరోక్షంగా దాడి చేశారని భావించాలని ఆంధ్రప్రదేశ్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు యం.రాజా అభిప్రాయపడ్డారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార & ప్రజాసంబంధాల శాఖ అమలు చేస్తున్న జర్నలిస్టుల అక్రిడేషన్ విధానాలు రాజ్యాంగ విరుద్ధంగా, న్యాయ సూత్రాలకు భిన్నంగా ఉన్నాయని ఏపీఐజేఏ అధ్యక్షులు యం. రాజా అభిప్రాయం వ్యక్తం చేశారు.ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్, కేబుల్ చానల్స్, చిన్న పత్రికలు, గ్రామీణ జర్నలిస్టులపై జరుగుతున్నఈ వివక్ష కొనసాగితే హైకోర్టును ఆశ్రయించక తప్పదని ఆంధ్రప్రదేశ్ ఇండిపెండెంట్ జర్నలిస్టు అసోసియేషన్ అధ్యక్షులు యం.రాజా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.