పల్నాడు జిల్లా డిసెంబర్ 29 మెదక్ టుడే న్యూస్:(స్టేట్ బ్యూరో)మాచర్ల పట్టణంలోని ఎం ఆర్ ఆర్ న్యూస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏపీ ఐజేఏ అధ్యక్షులు యం,రాజా మాట్లాడుతూ ప్రభుత్వాలు మారిన ప్రతిసారి జర్నలిస్టు సోదరులకు అన్యాయం జరుగుతూనే ఉందని వాపోయారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిన్న మధ్య వార మాస, పత్రికలంటూ వివక్ష చూపుతూనే ఉన్నారు.కేబుల్ యూట్యూబ్ చానల్స్ అంటూ వివక్ష చూపటం పరిపాటగా మారింది, కేవలం సాటిలైట్ చానల్స్ మాత్రమే మీ వార్తను ప్రసారం చేస్తున్నాయా అని ప్రశ్నించారు.?? ఇది కేవలం అధికారుల నిర్లక్ష్యమే ఐ&పిఆర్ లో ఉన్న కొంతమంది అవగాహన లోపమే అని చెప్పుకోవచ్చు, ఎవరో చేసిన తప్పులకు మేము బాధ్యులం కాదు అని ఏపీఐజేఏ అధ్యక్షులు యం, రాజా తీవ్రంగా ఖండించారు,