జనగణన పారదర్శకంగా నిర్వహించాలి డిప్యూటీ తహసిల్దార్ రమేష్.
చేగుంట,మే,18,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండల కేంద్రంలోని ఎన్జీవోస్ కాలనీలో సెన్సెస్ 2027 మొదటి దశ ఇండ్ల గణనను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇండ్ల గణన ను పారదర్శకంగా నిర్వహించాలని, సెన్సెస్ ఆఫ్ ఇండియా నియమ నిబంధనలు పాటించాలని, వారు విధించిన గడులోపు పూర్తిచేయాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్స్ చల్లా లక్ష్మణ్, రమాదేవి, ఏనిమరేటర్ విజలత తదితరులు పాల్గొన్నారు.