చేగుంట,మే,14,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలంలోని రెడ్డిపల్లి కాలనీలో జనగణనను పరిశీలించిన చేగుంట తహసిల్దార్ శివ ప్రసాద్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మే 11 నుండి మే 13 వరకు మ్యాపింగ్ చేశారని, ఈరోజు నుండి అన్ని గ్రామాలలో ఇండ్ల గణనను నిర్వహిస్తున్నారని, ఎనిమరేటర్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి ప్రజలు సహకరించాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఏ ఎస్ ఓ భూమేష్, ఎనుమారేటర్స్ మౌనిక,చల్లా రామకృష్ణ, సూపర్వైజర్ చల్లా లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు