చేగుంట,ఏప్రిల్,25,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలంలోని వడియారంజిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో మూడు రోజుల జన గణన శిక్షణ తరగతులు ముగింపు కార్యక్రమానికి చేగుంట మండల ఛార్జ్ ఆఫీసర్ శివప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జన గణన 2027 మొదటి దశలో భాగంగా ఇండ్ల గణన నిర్వహిస్తామని, రెండు దశలలో 72 మంది ఎనుమారేటర్స్ కు, 13 మంది సూపర్వైజర్లకు శిక్షణ ఇచ్చామని, వారందరూ మే 9 నుండి మూడు రోజులపాటు హౌసింగ్ లిస్టింగ్ బ్లాక్ మ్యాపింగ్ చేస్తారని, మే 11 నుంచి మండలంలోని అన్ని గ్రామాలలో ఇండ్ల గణన నిర్వహిస్తామని, సూపర్వైజర్లు, ఎనుమారేటర్స్ ఎటువంటి తప్పులు లేకుండా ఇండ్ల గణన నిర్వహించాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ ట్రైనర్ చల్లా లక్ష్మణ్, జంగం మల్లేశం, ఏఎస్ఓ భూమేష్, సూపర్వైజర్స్ , ఎనిమరేటర్స్ తదితరులు పాల్గొన్నారు