ఇందిరమ్మ ఇండ్లు .. పేదలకు వరం
పాపన్నపేట,మే,4,మెదక్ టుడే న్యూస్:ఇందిరమ్మ ఇండ్ల పథకం పేదలకు వరం లాంటిదని పాపన్నపేట గ్రామ సర్పంచ్ పావని నరేందర్ గౌడ్ పేర్కొన్నారు. సోమవారం పాపన్నపేటలో అచ్చుకట్ల రాణి రమేష్ నూతన గృహన్ని ఆమె అధికారులతో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో తహశీల్దార్ సతీష్ కుమార్,ఎంపీడీవో విష్ణువర్ధన్,హౌసింగ్ ఏఈ అరుణ్ ప్రసాద్ గౌడ్,ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్,ఉప సర్పంచ్ సద్దామ్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు .