MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 26 May 2026, 7:23 am Digital Edition : Shiva Kumar

ఐకేపీ మహిళా సంఘ భవనానికి శంకుస్థాపన చేసిన వడియారం గ్రామసర్పంచ్ అంకన్న సాయికుమార్ గౌడ్.

చేగుంట,మే,25,మెదక్ టుడే న్యూస్:చేగుంట మండలంవడియారం గ్రామంలో ఐకేపీ మహిళా సంఘ భవన నిర్మాణానికి ప్రభుత్వం మంజూరు చేసిన రూ.10 లక్షల నిధులతో చేపట్టనున్న పనులకు గ్రామ సర్పంచ్ సాయి కుమార్ గౌడ్ పాలక వర్గ సభ్యులు మహిళ సంఘం సభ్యుల తో కలిసి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ మహిళా సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని మహిళలకు సమావేశాలు నిర్వహించుకునేందుకు సౌకర్యవంతమైన భవనం అందుబాటులోకి రానుందని తెలిపారు. నిధులు మంజూరు చేసిన ఇంచార్జ్ మంత్రి వివేక్ వెంకట స్వామి,దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ సాయికుమార్ గౌడ్,ఉప సర్పంచ్ నాగరాజు, పంచాయతీ కార్యదర్శి విజయ్ పాల్ రెడ్డి, సీసీలు శ్వేత, శంకర్, వార్డు సభ్యులు జనార్ధన్ గౌడ్, గయాజ్, అనిల్, కవిత, సీఏ గాయత్రి, గ్రామ నాయకులు రాజు, నదీం, మహేష్ తదితరులు పాల్గొన్నారు.