మెదక్,నవంబర్,26,మెదక్ టుడే న్యూస్: ప్రతినిధి
పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ ఐ. రాణి కుముదిని తెలిపారు. బుదవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ ఐ. రాణి కుముదిని పంచాయతీ ఎన్నికల నిర్వహణపై జిల్లా కలెక్టర్ లతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు ఆదేశాలు, సూచలను జారీచెశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కమీషనర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉన్న గ్రామ పంచాయతీలకు 2వ సాధారణ ఎన్నికలను డిసెంబర్ 11న మొదటి విడత, డిసెంబర్ 14న రెండవ విడత, డిసెంబర్ 17న మూడవ విడత పోలింగ్ జరగనున్నట్లు తెలిపారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అప్ డేట్ చేసిన రిజర్వేషన్లు, పోలింగ్దశ, పోలింగ్ కేంద్రాల జియో లోకేషన్ వివరాలు టి-పోల్ వెబ్ సైట్ లో నవీకరించాలని తెలిపారు. టి-పోల్ వెబ్ సైట్ ద్వారా వచ్చే ఫిర్యాదుల పరిష్కారం కోసం జిల్లాలో నోడల్ అధికారిని నియమించాలని, ఎన్నికల కమిషన్ నుంచి వచ్చే ఫిర్యాదులను మూడు రోజులలో పరిష్కరించాలని అన్నారు. పొలింగ్ క్రేంద్రాల జాబితా,డిజిటల్ వివరాలను టి పోల్ లో నమోదు చేయాలని, పోలింగ్ కేంద్రాలలో లైట్, పవర్, ర్యాంప్, ఫర్నిచర్, భద్రతను చూసుకోవాలని, 2 కంటే ఎక్కువ పోలింగ్ కేంద్రాల్లో ఉన్న భవనం దగ్గర హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలని, వెబ్ క్యాస్టింగ్ జరిగే పోలింగ్ కేంద్రాల వివరాలు పంపాలని, డిస్ట్రిబ్యుషన్ కేంద్రాలు మండల కేంద్రాలో ఉండాలని, ఒట్ల లెక్కంపు కొరకు స్ట్రాంగ్ రూంలను 3 రోజుల ముందుగా సిద్దం చేసుకోని ఏర్పాట్లను పర్యవేక్షించుకోవాలని సూచించారు. నవంబర్ 27 నుంచి నవంబర్ 29 వరకు ప్రతిరోజు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరించాలని. పంచాయతీ ఎన్నికలకు సంబంధిత రిటర్నింగ్ అధికారులు వద్ద నామినేషన్ దాఖలు చేసేందుకు వీలుగా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అన్నారు. నామినేషన్ల స్వీకరణ, పరిశీలన,అప్పిళ్ళ పరిష్కారం, గుర్తుల కేటాయింపు, పోటి చేసే అభ్యర్థుల ప్రకటన పకడ్బందీగా జరిగేలా అవసరమైన మార్గదర్శకాల జిల్లా ఎన్నికల అధికారులు జారీ చేయాలని అన్నారు. జిల్లాలో ఉన్న ప్రింటర్లు అనుమతి లేకుండా ఎన్నికల ప్రచార కరపత్రాల ముద్రణ చేయకుండా సెక్షన్ 216 టిపిఆర్ చట్టం కఠినంగా ఆమలు చేయాలని ఆదేశించారు. ఎన్నికల ప్రచారం సంబంధించి అభ్యర్థుల వ్యయ వివరాలను నమోదు చేసేందుకు ధరలను ఖరారు చేయాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని కలెక్టర్ లకు ఎన్నికల కమిషనర్ సూచించారు. ప్రతి మండలానికి ఒక ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందం, ఒక ఏ.ఈ.ఓ (సహాయ వ్యయ వివరాల నమోదు అధికారి), ప్రతి జిల్లాకు ఒక స్టాటిక్ సర్వేలెన్స్ బృందం ఏర్పాటు చేసి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు తప్పనిసరిగా జరిగేలా పర్యవేక్షించాలని అన్నారు. ప్రతి జిల్లాలో ఎం.సి.ఎం.సి కమిటి, జిల్లా మీడియా సెల్ ఏర్పాటు చేయాలని అన్నారు. ఎన్నికల ప్రచార సమయంలో వినియోగించే ఎలక్ట్రానిక్ వీడియోలకు ముందుగా ఎం.సి.ఎం.సి అనుమతి ఉండాలని అన్నారు. ఎన్నికల దృష్ట్యా తనిఖీలు నిర్వహించే నేపద్యంలో రైతులు పంట డబ్బులు తీసుకుని వెళ్లే సమయంలో తప్పనిసరిగా రశీదు పెట్టుకునేలా అవగాహన కల్పించాలని అన్నారు. ఎం.సి.సి అమలులో నిర్వహించే తనిఖీల లో నగదు, బంగారం, ఇతర పరికరాలు సీజ్ చేసే సమయంలో తప్పనిసరిగా రశీదు అందించాలని, సీజ్ చేసిన పరికరాలకు సంబంధించిన ఆధారాలు సమర్పించేందుకు ఏ అధికారి ముందు హాజరు కావాలని వివరాలు ఆ రసీదు లో ఉండాలని అన్నారు. వీసీ అనంతరం ఎన్నికల నిర్వహణ మీద సంబంధిత అధికారులతో *జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ,ఎన్నికల నిర్వహణ సాఫీ గా జరగలన్నారు.
ప్రతీ ఒక్కరికి ఎన్నికల నియమ నిబంధనల పై అవగాహన ఉండాలన్నారు.
పోలింగ్ నుండి కౌంటింగ్ వరకు జరిగే ప్రతీ ప్రక్రియ పైన సమగ్ర అవగాహన కల్పించాలన్నారు.
ఎన్నికల నిర్వహణ లో విధులు నిర్వర్తించే ప్రతీ ఒక్క అధికారి తమ విధుల పట్ల జాగ్రత్త గా ఉండాలన్నారు
ఎన్నికల ప్రవర్తన నియమావళి జిల్లాలో పక్కాగా అమలయ్యేలా చూడాలన్నారు.
ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు.. రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలను తూచా తప్పకుండా అనుసరించాలన్నారు.ఈ వీసీ లో జిల్లా ఎస్పీ డి.వి శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ నగేష్, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డిపిఓ యాదయ్య, అడిషనల్ ఎస్పీ మహేందర్, డీఎస్పీలు తదితరులు పాల్గొన్నారు.
