MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 10 September 2026, 4:04 am Digital Edition : SHIVA KUMAR

గురువులకు ఘన సత్కారం-ఉప సర్పంచ్ రఫీ ఆత్మీయ సన్మానం.

చేగుంట, సెప్టెంబర్ 09 మెదక్ టుడే న్యూస్:బావి భారత పౌరులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు చేస్తున్న కృషి వెలకట్టలేనిదని, సమాజ నిర్మాణంలో వారి పాత్ర కీలకమని ప్రముఖులు పేర్కొన్నారు.ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని చేగుంట ఉప సర్పంచ్ మహమ్మద్ రఫీ ఆధ్వర్యంలో బుధవారం మండల కేంద్రంలో ఉపాధ్యాయ ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి అయిత రఘురాములు, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు రజనకు రామచంద్రం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మండలంలోని వివిధ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులను శాలువాలతో ఘనంగా సత్కరించి, కలాలను (పెన్నులు) బహూకరించి అభినందనలు తెలిపారు.నిస్వార్థంగా విద్యను పంచుతూ సమాజాన్ని ప్రగతి బాటలో నడిపిస్తున్న గురువులను గౌరవించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అతిథులు అన్నారు.కార్యక్రమంలో వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.