MEDAK TODAY
Newspaper Banner
Date of Publish : 30 November 2025, 9:45 am Digital Edition : Medak Today

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోటీ చేసే అభ్యర్థులకు అవగాహన కల్పించే అంశాలుజిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్..

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పోటీ చేసే అభ్యర్థులకు అవగాహన కల్పించే అంశాలు
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

పబ్లిక్ మీటింగ్ పెట్టుకోవడానికి అనుమతులు

వివిధ రాజకీయ పార్టీ ల ప్రతినిధులు అలాగే పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ ప్రచారం కోసం పబ్లిక్ మీటింగ్ పెట్టుకోవడానికి, ర్యాలీ లు నిర్వహించడానికి, మైకులు పెట్టుకోవడానికి సంబంధిత మండల తహసీల్దార్ కి అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవలిసి ఉంటుంది.. అప్పుడు ఆ తహసీల్దార్ స్థానిక SHO ద్వారా వారికి అనుమతి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.

పోలింగ్ పరిసమాప్తం కావడానికి నిర్ణయించిన సమయానికి ముందు 44 గంటల నుండి బహిరంగ సభలను నిర్వహించటం, ఊరేగింపులు చేయడం నిషిద్ధం అని అన్నారు.

అనుమతి పొందిన బహిరంగ సమావేశాలు అలాగే రోడ్ షో ల వద్ద లౌడ్ స్పీకర్లు ఉదయం 6 గంటల నుండి రాత్రి పది గంటల మధ్య మాత్రమే ఉపయోగించాలన్నారు.

ఈ నిబంధనను ఎవరైనా ఉల్లంఘించినట్లయితే పోలీస్ అధికారులు లౌడ్ స్పీకర్ లను జప్తు చేయడానికి అధికారం కలిగి ఉంటారని పేర్కొన్నారు.

ఎన్నికల ప్రచారానికి వాహనాల వినియోగం

సర్పంచ్ పదవికి పోటీ చేసే అభ్యర్థులు గ్రామపంచాయతీ పరిధిలో తమ ప్రచారానికి ఒక వాహనాన్ని ఉపయోగించడానికి అనుమతి ఇస్తారని తెలిపారు.

అట్టి అభ్యర్థులు ప్రచారానికి వినియోగించేందుకు ప్రతిపాదించిన వాహనాల వివరాలను సంబంధిత తాసిల్దార్లకు ముందుగా తెలియజేయాల్సి ఉంటుందన్నారు.

వార్డు సభ్యుని పదవికి పోటీ చేసే అభ్యర్థులు ప్రచారం కోసం ఎలాంటి వాహనాన్ని ఉపయోగించకూడదు అని వివరించారు.

పోలింగ్ రోజున వాహనాల వినియోగం

పోలింగ్ రోజున గ్రామపంచాయతీ సర్పంచ్ పదవికి పోటీ చేసే అభ్యర్థులు ఒక వాహనాన్ని ఉపయోగించేందుకు మాత్రమే అనుమతిస్తారు అని తెలిపారు.

పోలింగ్ రోజున ఇతర వాహనాలను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరు అని అన్నారు.

వార్డు విస్తీర్ణం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి వార్డు మెంబర్ పదవికి పోటీ చేసే అభ్యర్థులకు వాహన అనుమతి ఉండదు
అని చెప్పారు.

వాహన అనుమతులు

సంబంధిత తహసిల్దార్లు నిర్ణిత నమూనాలో గ్రామపంచాయతీ సర్పంచ్ పదవులకు పోటీ చేసే అభ్యర్థులకు మాత్రమే వాహన పర్మిట్లను జారీ చేస్తారు
అని అన్నారు.

వాహన పర్మిట్ అసలు ప్రతి వాహనం ముందు వైపు అద్దంపై అభ్యర్థులు అతికించాల్సి ఉంటుంది అని పేర్కొన్నారు.