కొల్చారం,మే,23,మెదక్ టుడే న్యూస్:మెదక్ జిల్లా కొల్చారం మండలం వెంకటాపూర్ గ్రామంలో వెంకటేశ్వర స్వామి ఆలయ ధర్మకర్త పట్వారి ప్రసాద్ రావు పంతులు ఆధ్వర్యంలో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు శని, ఆదివారాలు రెండు రోజులు నిర్వహిస్తామని, శనివారం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి అభిషేకము అలంకరణ కళ్యాణం మహోత్సవం, ఆదివారం గోపాల కాలువలు సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం పట్వారి ప్రసాదరావు మాట్లాడుతూ ఎంతో ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని ప్రతి సంవత్సరం జేష్ట వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు స్వామి వారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి పైన ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను అని తెలిపారు ఈకార్యక్రమంలో సర్పంచ్ సుజాత శేకులు ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్లు గ్రామ ప్రజలు యువకులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
