సిద్దిపేట్, మర్కుక్, జులై 20, మెదక్ టుడే న్యూస్
గజ్వేల్ ఏసిపి కే.నర్సింలు,మర్కూక్ పోలీస్ స్టేషన్ను ఆకస్మిక తనిఖీ చేశారు.కె.నర్సింలు, ఏసీపీ గజ్వేల్ వార్షిక తనిఖీ నిమిత్తం మర్కూక్ పోలీస్ స్టేషన్ను సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆవరణ మొత్తం పరిశీలించి, స్టేషన్లోని అన్ని విభాగాలను తనిఖీ చేశారు. సిబ్బంది పనితీరు, రికార్డులు, కేసు ప్రాపర్టీ, స్టేషన్ ఆవరణలో ఉన్న కేసు సంబంధిత వాహనాలను,పరిశీలించారు.అదేవిధంగా, పోలీస్ స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారులతో , మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. మర్కూక్ పోలీస్ స్టేషన్లో నిర్వహిస్తున్న సైబర్ క్రైమ్, రిసెప్షన్, కోర్టు డ్యూటీ, (సీ సీ టీ ఎన్ ఎస్ ) తదితర విభాగాల పనితీరును సమీక్షించి, సంబంధిత సిబ్బందికి అవసరమైన సూచనలు అందజేశారు.అలాగే, పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగే ఆర్థిక నేరాలు, దొంగతనాలు ఇతర నేరాల దర్యాప్తు విషయంలో మర్కూక్ ఎస్ఐ ఎస్.కె యూనస్ అహ్మద్ అలీ,కి పోలీస్ స్టేషన్ సిబ్బందికి పలు సూచనలు చేసి, దర్యాప్తును నిష్పాక్షికంగా, వేగవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. ఈ వార్షిక తనిఖీలో గజ్వేల్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రవి రాజు, పాల్గొన్నారు.
