పటాన్చెరు,మే,26,(మెదక్ టుడే) న్యూస్ ప్రతినిధి.భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం కోసం పటాన్చెరు నియోజకవర్గ సభ్యత్వ బాధ్యునిగా రాష్ట్ర కమిటీ నియమించిన, మాజీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ శ్రీ ఎర్రోళ్ల శ్రీనివాస్ను ఎం.డి.ఆర్ ఫౌండేషన్ సహ వ్యవస్థాపకులు, బీఆర్ఎస్ నాయకులు మాద్రి పృథ్వీరాజ్ మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ, పార్టీ బలోపేతం కోసం క్షేత్రస్థాయిలో తాము సైతం చిత్తశుద్ధితో కృషి చేస్తామని శ్రీనివాస్కు హామీ ఇచ్చారు. పటాన్చెరు మరియు జేపీ కాలనీ పరిధిలోని ప్రాంతాల్లో, స్థానిక శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి మరియు నియోజకవర్గ సమన్వయకర్త ఆదర్శ్ రెడ్డిల నాయకత్వంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు నిరంతరం శ్రమిస్తానని పేర్కొన్నారు.భవిష్యత్తులో రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మరింత బలపడి, తిరిగి విజయపధంలో దూసుకెళ్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణులంతా ఐక్యంగా కలిసి పనిచేసి సభ్యత్వ నమోదును దిగ్విజయం చేయాలని పిలుపునిచ్చారు.